రవీంద్రభారతి, జనవరి 20: అంతరించిన పోతున్న కళలు, కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజుల పాటు జరిగే సుస్వర రాగోత్సవం 2023 కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసులు రాఘవచారి, శేషాచారిలకు పురస్కారాలను అందజేశారు.
సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి స్వాగతోపన్యాసం చేసిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ.రమణాచారి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ మహిళా భద్రత విభాగం అధికారి సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కే.రామాచారి, డాక్టర్ జయప్రద రామమూర్తి ప్రదర్శించిన పలు సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.