బడంగ్పేట, ఏప్రిల్16: మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులకు చెప్పులు, షూస్ ఇప్పించి మానవత్వం చాటారు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా బాలాపూర్ దేవతల గుట్టలో పూజలు చేసి వెళ్తుండగా ఆరుగురు విద్యార్థులు చెప్పులు లేకుండా మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి నడుచుకుంటూ వస్తుండడాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ ఆపారు. విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆదేశాలతో టీఆర్ఎస్ బీసీసెల్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మల నరేందర్ ఆరుగురికి చెప్పులు, షూ ఇప్పించారు.