బడంగ్పేట/పహాడీషరీఫ్, మార్చి 24: డివిజన్ల అభివృద్ధి ధ్యేయంగా నిధులు మంజూరు చేసి దశలవారీగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లోని రూ.1.4కోట్ల నిధులతో అభివృద్ధి శ్రీకారం చుట్టా రు. సాయిప్రభు కాలనీలో రూ.30లక్షల నిధులతో తాగునీటి పైపులైన్ పనులకు, సీపీఎన్ఆర్ టౌన్షిఫ్ నుంచి సాయిబాలాజీ వరకు రూ.40 లక్షల నిధులతో, సాయినగర్ కాలనీలో రూ.22 లక్షల నిధులతో, గణేశ్ కాలనీలో రూ.11.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులను చేయిస్తానని, ఇప్పటికే కోట్లాది రూపాయలతో ప్రధాన రహదారులను అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి పనులు త్వరగతిన ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత, డిఫ్యూటీ మేయర్ ఇబ్రహీంశేఖర్, స్థానిక కార్పొరేటర్ మనోహర్, భారతమ్మ, అర్జున్, పవన్ యాదవ్, శివకుమార్, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి, ఆనంద్రెడ్డి, హరిగౌడ్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ముస్లిం సోదర, సోదరీమణులు అత్యంత నియమనిష్టలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్భాల్ బిన్ ఖలీఫా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సైయ్యద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో శుక్రవారం రంజాన్ నెల క్యాలండర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. క్యాలండర్ ప్రకారంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించాలన్నారు. ప్రతి ఒక్కరిపై అల్లా దయ ఉండి అందరూ సుఖసంతోషాలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పర్వేజ్, మన్నన్, జాఫర్ పాల్గొన్నారు.