కందుకూరు, నవంబర్ 6: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన 50 మందికి పైగా సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ నాయకుల మాటలకు అర్థం లేదని, ఈ ఎన్నికలను సవాల్గా స్వీకరించి.. బీజేపీని చిత్తుగా ఓడించాలన్నారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. నర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. నాయకులు మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, మహేందర్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, మాజీ డైరెక్టర్, పారిజాతం, బాలరాజు, భిక్షపతి, బాబయ్య, పర్వతాలు, భీమయ్య, యూత్ నాయకులు ఐనవోలు శ్రీకాంత్రెడ్డి, డైరెక్టర్ నర్సింహ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అలీ, శ్రీశైలం, కటికపల్లి సర్పంచ్ బుడ్డొల్ల నరేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.