కందుకూరు, జూన్ 18: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘మంచినీళ్ల పండుగ’ను మండల పరిధిలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలతో కలిసి మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన తాగునీటి ఇబ్బందులు ఉండేవని, ప్రజల ఇబ్బందులను చూసి చలించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో మంచినీటి ఇబ్బందులు ఉండవని, సమస్యను పరిష్కరించకుంటే ఓట్లు అడుగనని శపథం చేసి, ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి తాగునీరు అందజేస్తున్నారని చెప్పారు.
మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కాష్టాలు సంపూర్ణంగా తీరిపోయినట్లు పేర్కొన్నారు. రక్షిత మంచినీరు అందిస్తుండటంతో సీజనల్ వ్యాధులు, ప్లోరోసిస్ సమస్య పోయిందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూ. 210కోట్లతో నూతన పైపులైన్లు, రిజర్వాయర్లు, ట్యాంకులను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీలు బొక్క జంగారెడ్డి, జయమ్మ, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, ఎంపీపీలు మంద జ్యోతి పాండు.కృపేష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహా రెడ్డి, కాకి దశరధ ముదిరాజ్, మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, ఎలుక మేథనాధ్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, సర్పంచ్ రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, బుగ్గ రాములు, రాంరెడ్డి, సామ ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.