హైదరాబాద్, ఆట ప్రతినిధి, జూలై 23: క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘లెసినియో.కామ్, లెసినియో’ యాప్ను టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా, మహిళా క్రికెటర్ సునీతా ఆనంద్, ఎమ్మెల్యే నరేందర్రెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘లెసినియో సహకారంతో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను దేశ వ్యాప్తంగా చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తున్నదన్నారు. ఈ యాప్ ద్వారా విద్యతో పాటు క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానంగా గ్రామీణ క్రీడాకారులకు ఇలాంటి యాప్లు బాగా ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ మాజీ డీన్ వెంకట్రెడ్డి, జేఎన్టీయూ మాజీ డీన్ రాజేశం, కొండల్రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, నర్మదా రెడ్డి, మల్లారెడ్డి, యాప్ ఫౌండర్ అనూషరెడ్డి తదితరులు పాల్గొన్నారు.