బడంగ్పేట, నవంబర్16: ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్న ..మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్సిపల్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8,9,10,11 డివిజన్లకు సంబంధించిన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. 10వ డివిజన్ ముద్ద పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఎన్నికల కార్యాలయం చాలా భాగా చేశారని పవన్ను మంత్రి ప్రశంసించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేవెళ్ల, మేడ్చల్లో చెల్లని రూపాయ మహేశ్వరంలో ఎలా చెల్లుతుందో ప్రజలు గమనించాలన్నారు. మాయ మాటలు చెప్పి ఓట్లు దండు కోవడడానికి వస్తు వారి మాటలు నమ్మితే అభివృద్ధి పూర్తిగా కుంటు పడుతుందన్నారు. పెండింగ్ పనులు ఆగిపోతాయన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ప్రజల సమస్యలను పట్టించుకోరన్నారు.
మీర్పేటలో ఉన్న కాలనీలు బంజారాహిల్స్ తరహాలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రూ.110 కోట్లతో నాలాలను అభివృద్ధి చేయిస్తున్నామన్నారు. రూ.280 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేయడం జరిగిందన్నారు. రిజర్వాయర్లు, ట్యాంక్లు, పైపులైన్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. రూ.40 కోట్లతో చెరువులను సుందరీకరణ పను లు చేయడం జరిగిందన్నారు. 93లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
బడంగ్పేటలో ఉన్న యువత మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో చేరారు. వారందరికీ మంత్రి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 24లక్షల మందికి ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు.
మహేశ్వరం, నవంబర్ 16: మహేశ్వరం మండలంలోని నాగారం, నందుపల్లి, తీగలకుంట, ఏనుగుచెరువుతండా, పడమటి తండా, ఏనెమిది తండా, నాగిరెడ్డిపల్లి, హబీబుల్లాగూడ, గొల్లూరు, అమీర్పేట్, తూప్రఖుర్ధు, పెద్దమ్మతండా, నల్లచెరువు తండా,మాణిక్యమ్మగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని జడ్పీ చైర్పర్సన్తీగల అనితాహరినాథ్రెడ్డితో కలిసి మంత్రి నిర్వహించారు. మొదట నాగారం గ్రామంలో అమరుడు సిరిపురం యాదయ్య సమాది వద్ద శ్రద్ధాంజలి ఘటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రికి బతుకమ్మలు, మంగళహారతులు, భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజక వర్గానికి ఇష్టం లేక వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ బలగం నామరూపాలు లేకుండా చేయాలని అన్నారు.
మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, రియల్ సేవకురాలికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ప్రజలే న్యాయనిర్ణేతలని ఆమె తెలిపారు. ఆడబిడ్డగా నన్ను దీవించి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. నియోజ వర్గాన్ని ఇప్పటికే అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ నినాధంతో ప్రజల ముందుకు వస్తున్నామని ఆమె తెలిపారు. తెలంగాణ రాక ముందు గ్రామాలు ఎట్లా ఉండే ఇపుడు ఎలా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
మహేశ్వరం, నవంబర్ 16: అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్ అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో ఇంటింటికీ బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం మండలం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్ అన్నారు. గురువారం తుక్కుగూడలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తుక్కుగూడలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. నియోజక వర్గం అభివృద్ధి ప్రదాత మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. నియోజక వర్గం అభివృద్ధికి మంత్రి ఒక దిక్సూచిగా నిలుస్తున్నారని అన్నారు. నాయకులు పెంటమల్ల సురేశ్, యాదగిరి, శ్రీనివాస్, కార్తీక్, విజయ్ పాల్గొన్నారు.