బడంగ్పేట,అక్టోబర్30: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలతో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వేల మందికి షాదీ ముబారక్ చెక్కులను అందజేసినట్లు గుర్తు చేశారు. ఐదు కోట్లతో పాఠశాలను నిర్మించామన్నారు.
పహాడీషరీఫ్ దర్గాకు ర్యాంప్ ఏర్పాటు చేయడానికి రూ. 14 కోట్లు కేటాయించి పనులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఓటరును కలిసి బీఆర్ఎస్కు ఓట్లు వేయించే విధంగా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు. మరోసారి అవకాశం ఇస్తే జల్పల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తామన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసే వారి మాటలను నమ్మకూడదన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. ఓటమి భయంతో ప్రతి పక్షాలు దాడులకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. ప్రజా స్వామ్యంలో దాడులకు తావు లేదన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు షంషీద్ దీన్, ఈసూప్ పటేల్ తదితరులు ఉన్నారు.
కందుకూరు, అక్టోబర్ 30 : మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం ఖాయమని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డిలతో కలిసి సబితా ఇంద్రారెడ్డి గెలుపు కోసం సోమవారం కొత్తగూడ, జైత్వారం, గూడూరు, తదితర గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ప్రచారం చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని, పొరపాటున ప్రతి పక్షాల అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్. మాజీ డైరెక్టర్ సామ ప్రకాశ్రెడ్డి, మాజీ సర్పంచ్ రాయిచెట్టు యాదయ్య, సీనియర్ నాయకులు లచ్చానాయక్, చిర్ర సాయిలు, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎర్రబైరు సదాలక్ష్మీ, శ్రీలత, ఎర్రబైరు పల్లారెడ్డి, శ్రీహరి,యూత్ నాయకులు విఘ్నేశ్వర్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి, పిట్టల యాదయ్య, కల్లెం సదానంద్గౌడ్, డైరెక్టరు పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్లు,పర్వతాల్ యాదవ్, జంగయ్య. దేవేందర్, మక్తాల వెంకటేశ్గౌడ్, మైనార్టీ నాయకులు అంజద్, అజ్జు ,తల్లోజు లక్ష్మాణాచారి, బుగ్గరాములు, మైసయ్య, జంగయ్య, శంకర్, మల్లారెడ్డి, మహిపాల్రెడ్డి, ఖలీల్, మైఘనాత్రెడ్డి, పొట్టి ఆనంద్, డీల్లి శ్రీధర్ ముదిరాజ్, శ్రీవైలం , గండు న ర్సింహ, మహేందర్, శంకర్, శ్రీపాల్రెడ్డి, శ్రీధర్రెడ్డి, బక్క రాజు, భూసాల్రెడ్డి, బాబు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం, అక్టోబర్ 30 : మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సబితాఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని సరూర్నగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కోరారు. సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని సోమవారం సరూర్నగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, హుడా కాంప్లెక్స్, ఎంప్లాయిస్ కాలనీ, అంబేద్కర్నగర్, పంజాల అనిల్ కుమార్ కాలనీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి తనయుడు కళ్యాణ్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని, మహేశ్వరం ఎమ్మెల్యేగా సబితాఇంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేర బాలకిషన్, పారుపల్లి అనితాదయాకర్రెడ్డి, లోకసాని కొండల్రెడ్డి, ఇంటూరి అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.