పహాడీషరీఫ్, జూన్ 24 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17,18, 19 వార్డుల్లో రూ. ఒక కోటి 39 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి పనులకు చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్, కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, శ్రీధర్గౌడ్, భాషమ్మ రమేశ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మిషన్ భగీరథ ట్యాంకును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రాష్ర్టాలకు సంబంధించిన ప్రజలు శ్రీరామకాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. జనాభాకు అనుగుణంగా రూ. 64 లక్షలతో ట్యాంకును నిర్మించామన్నారు.
100 గజాల లోపు ఉన్న వారికి ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తుందన్నారు. కౌన్సిలర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అవినీతి లేకుండా ప్రజల్లో విశ్వాసం కలిగించేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ విశ్వేశ్వరరావు, ఏఈ కిష్టయ్య, కౌన్సిలర్ శంషోద్దీన్, నాయకులు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, షేక్అప్జల్, యంజాల జనార్దన్, మాజీ సైనికుడు వాసుబాబు, నిరంజన్, దూడల సుధాకర్గౌడ్, నాగభూషణం, దామోదర్రెడ్డి, కర్నాటి పద్మ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, జూన్ 24 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం మండలం పరిధిలోని సరస్వతీగూడ గ్రామానికి చెందిన గుల్వి మమత కూతురు పూజతో పాటు పలువురికి కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికసాయం అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మి సురేందర్రెడ్డి, మండల పీఎసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, సర్పంచ్ రాము, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి. ఎంపీటీసీ యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జయమ్మ పాల్గొన్నారు.