కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 9 కుటుంబాలను గుర్తించి బుధవారం వారి ఇంటికి వెళ్లి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, సెల్ఫోన్లు అందజేసి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…అనాథ బాలబాలికలకు అందిస్తున్న సెల్ఫోన్లో బాలల సంరక్షణ కోసం పనిచేస్తున్న అన్ని లైన్ డిపార్ట్మెంట్ ఫోన్ నంబర్లు, ఇతర ఎమర్జెన్సీ టోల్ఫ్రీ నంబర్లు కూడా ఫీడ్ చేసి ఉన్నాయని… వారికి ఎలాంటి సమస్య వచ్చినా అధికారులను సంప్రదించాలని సూచించారు. బాలాపూర్లో శ్రీనివాస్రెడ్డి కుటుంబం కరోనా బారిన పడి మృతి చెందడంతో అనాథలైన వారి పిల్లలకు ధైర్యం చెప్పి.. పలు రకాల వస్తువులను మంత్రి అందజేశారు. వీరికి డిగ్రీ వరకు ఉచిత విద్యతో పాటు నెలకు రూ. 3వేలు ఖర్చుల కోసం అందిస్తామని తెలిపారు. ఇండ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు