బడంగ్పేట, సెప్టెంబర్ 13 : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ కమిటీని ఎన్నుకున్నట్లు మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వార్డుస్థాయి నుంచి పార్టీ నూతన కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణాత్మకంగా పార్టీని పటిష్టం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పనిచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో పార్టీ కమిటీలు వేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మీర్పేట మున్సిల్ కార్పొరేషన్ అధ్యక్షురాలు లావణ్యబీరప్ప, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, కార్పొరేటర్లు ఉన్నారు.
ఆపదలో ఉన్న వారికి సీఎం కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 44లోని న్యూ సర్వోదయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అశోక్కు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.60వేల చెక్కును సోమవారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే లబ్ధి చేకూరుందన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డికి, కార్పొరేటర్లు ఉన్నారు.
ఆర్కేపురం, సెప్టెంబర్ 13 : సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్కు చెందిన ముదాసిర్ అహ్మద్కు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.19,500ల చెక్కును సోమవారం మంత్రి బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం సహాయనిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నగేశ్, మాజీ అధ్యక్షుడు అరవింద్ శర్మ, నాయకులు సాజిద్, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.