Minister Ponnam | సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీపై హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. గురువారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులో సమీక్ష సమావేశం జరగాల్సి ఉండగా.. తదుపరి తేదీని చెబుతామంటూ మంత్రి కార్యాలయం.. జీహెచ్ఎంసీకి సమాచారం చేరవేసింది.
అయితే అసలే ఉద్యోగులకు జీతాల చెల్లింపులు కష్టతరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆస్తిపన్ను వసూళ్లు గణనీయంగా తగ్గాయి. రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి ఆర్థిక భరోసా దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా వివిధ అంశాలు సమీక్షతో ముడిపడి ఉండటంతో అధికారుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.