హైదరాబాద్ : ప్రజాకవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని వెంకన్న నివాసంలో కలిసి గోరటి దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన కవిత్వం, ఆటపాటలతో పాలమూరు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న గోరటి సేవలు వెలకట్టలేనివన్నారు. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.