కీసర/ఘటకేసర్ రూరల్, జూలై 15: ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిధి కొర్రెములలో రూ.10లక్షల నిధులతో ఎస్సీ కమ్యునిటీ హాల్ నిర్మాణానికి, రూ.70 లక్షలకు పైగా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ఆలయాలు, డ్వాక్రా భవనం, స్పోర్ట్స్ క్లబ్ భవనం, రజక సంఘం, గౌడ సంఘం, మసీదు భవనాల నిర్మాణాలకు మంత్రి మల్లారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కీసర మండల పరిధి గోధుమకుంట గ్రామంలో రూ.13లక్షలతో సీసీ రోడ్డు పనులను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం కీసర మండలం గోధుమకుంట, రాంపల్లిదాయరలోని 30మంది ఎస్సీ మహిళలకు అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో మంత్రి కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆయా కార్యక్రమా ల్లో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని కులవృత్తి ,చేతి వృత్తిదారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఆర్థిక సహా యం అందిస్తున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం అత్యధిక నిధులను కేటాయిస్తున్నామన్నారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ ఘటకేసర్ లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు భద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో అరుణ, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ఎంపీటీసీ వినోద, ఉప సర్పంచ్ రాజు, మండ ల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, నాయకులు వేణుగోపాల్, మహీంద్రాచారి, రవి, వార్డు సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.కీసరలో జరిగిన కార్యక్రమం లో సర్పంచ్ మహేందర్రెడ్డి, రాంపల్లిదాయర సర్పం చ్ అండాలుమల్లేశ్, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ డాక్టర్ భద్రారెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ కిరణ్జ్యోతి, కార్యదర్శి సురేశ్రెడ్డి, ఎస్సీకార్పొరేషన్ ఈడీ బాలాజీ, పంచాయతీ సభ్యులు, అభయ అసోసియేషన్ సభ్యులు,ప్రెసిడెంట్ ఉషా, ప్రధాన కార్యదర్శి సుచిత్రరెడ్డి, జాయింట్ సెక్రటరీ అలివేణి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ భానుమతి, బీఆర్ఎస్ నేతలు కృష్ణ, పెంటయ్య పలువురు పాల్గొన్నారు.
వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలోమంత్రి పూజలు
ఘట్కేసర్ మున్సిపాలిటీ బాలాజీ నగర్లోని శ్రీవీర బ్రమ్మేంద్రస్వామి ఆలయంలో శనివారం జరిగిన కల్యాణోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.పూజారులు మంత్రి మల్లారెడ్డిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు జంగయ్య యాదవ్,కార్యకర్తలు ఉన్నారు.