మేడ్చల్ రూరల్, అక్టోబర్ 30: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటువేస్తే మోరీలో వేసినట్టేనని, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ది పనులు తెలంగాణలో సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసి దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ నిలిచారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యులతో సోమవారం కండ్లకోయలోని ఓ గార్డెన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం పద్నాగేండ్లు కొట్లాడి, సాధించిన తెలంగాణను అభివృద్ధిలో దేశంలో ఆదర్శంగా నిలిపారని అనారు.
సీఎం పాలనలో సాగు, తాగు నీరు, కరంట్, కల్యాణలక్ష్మక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, రైతు ,దళిత,బీసీ,ముస్లిం బంధు, గృహలక్ష్మి తదితర పథకాలను అందించారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠథామాలు, గ్రామ పంచాయతీ భవనాలు, వీధిలైట్లు, ఆలయాలు అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు చేశానని అన్నారు.57 ఏండ్ల పాలించిన కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసిందని, మర్చిపోయి కూడా కాంగ్రెస్కు ఓటు వేయవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన పథకాలను ఇంటింటికీ తెలియజేసి బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
మేడ్చల్లో ఎవరూ గుర్తుపట్టని కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నామని ప్రగల్భాలు పలుకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ముఖాలన్నీ పాసిపోయాయని, సీఎం కేసీఆర్ సుధీర్రెడ్డిని ఎమ్మెల్యే చేశారని, ఇప్పుడు ఆయన కొడుకును జడ్పీ చైర్మన్ చేస్తే అమ్ముడు పోయాడని ఆరోపించారు. కబ్జాకోరు మైనంపల్లి కాంగ్రెస్లోకి వెళ్లిన తర్వాత పిల్లిగా మారాడని, ఆయన మల్కాజ్గిరిలోనే గెలువనోడు మేడ్చల్కు వస్తే ఆయన మాట వినే పరిస్థితిలో ఎవరూ లేరని అన్నారు. ఎన్ని జిమ్ముక్కులు చేసినా మేడ్చల్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాదని తెలిపారు.
ఏ లోటు లేని తాను ఇకపై ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని మంత్రి తెలిపారు. గతంలో నియోజవర్గంలో ఎవరు చేయలేని విధంగా ప్రతి గ్రామంలో రోడ్లు వేయించి, కులసంఘాల కమ్యూనిటీ భవనాలు నిర్మించి, ఆలయాలను అభివృద్ధి చేసి మీ ముందుకు వచ్చానని తెలిపారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం అని కాంగ్రెస్కు ఊరుకొక్క నాయకుడు కూడా లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, జిల్లా రైతు సమన్యయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజ, వైస్ ఎంపీపీ వెంకటేశ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయనందరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు సురేశ్రెడ్డి, సుధాకర్రెడ్డి, రణదీప్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు గౌస్, సర్పంచ్లు బాబు యాదవ్, గణేష్, కరుణాకర్, లక్ష్మి, నర్మద, శ్యామల, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి దర్శన్, నాయకులు రాజమల్లారెడ్డి, అంతిరెడ్డి, బలరాంరెడ్డి, భాగ్యరెడ్డి, ప్రభాకర్రెడ్డి, అశోక్, యూనుస్ పాష, సాయిలు, శివలక్ష్మీ, రమాదేవి, రామకృష్ణుడు, పాండు, రవీందర్, కిషన్నాయక్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, అక్టోబర్30: తెలంగాణ ఏర్పాడ్డాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పీర్జాదిగూడ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మీ శ్రీధర్రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలో పలుకాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టో ప్రతులను ఇంటింటికి అందిస్తూ ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్రెడ్డి, వార్డు కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
దేశంలోనే మేడ్చల్ నియోజకవర్గం ఓ ప్రత్యేకమైనదని, ఐడు మండలాలు, 61 గ్రామ పంచాయతీలు, మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు గల ఏకైక నియోజకవర్గం మేడ్చల్ అని మంత్రి అన్నారు. 210 కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, 61 మంది సర్పంచ్ లు, 44 మంది ఎంపీటీసీలు, 44 మంది కో ఆప్షన్ సభ్యులు, ఐదుగురు జడ్పీటీసీలు, ఐదుమంది ఎంపీపీలు, సింగిల్ విండో సభ్యులు, డైరెక్టర్లు, వార్డు సభ్యు లు, ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి 1200లకు పైగా పాలక వర్గ సభ్యులు ఉన్న నియోజకవర్గం ఓ చిన్న సామ్రాజ్యంలాంటిందని అన్నారు. మేడ్చల్కు ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవని, జాతీయ రహదారులు, పరిశ్రమలు ఉన్నాయని, ఐటీ పార్కు ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. ఇలాంటి నియోజకవర్గానికి ఎంపీగా,ఎమ్మెల్యేగా,మంత్రినైనా సేవ చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు.