క్రీడా ప్రాంగణాలను ప్రారంభించిన మంత్రి చామకూర మల్లారెడ్డి
ఘట్కేసర్ రూరల్, జూన్ 2 : ప్రపంచ గుర్తింపు గల క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి… అవుషాపూర్, కాచవానిసింగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలను మంత్రి , జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి యువతకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఆరేండ్లలో చేసి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టన్ జాన్ శ్యాంసన్, జిల్లా వైస్ చైర్మన్ వెంకటేశం, ఎంపీడీవో అరుణ, సర్పంచులు కావేరి మశ్చేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్లు ఐలయ్య యాదవ్, గీత, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి, బస్వరాజ్గౌడ్, ముస్తఫా, నాగరాజు పాల్గొన్నారు.
చౌదరిగూడలోని శ్రీ దేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి వారి కల్యాణ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. సర్పంచ్ బైరు రమాదేవి, మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ పాల్గొన్నారు.