జవహర్నగర్, మార్చి 17: జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు చెందిన మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ. 25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. చెరువులో ఈతకు వెళ్లి చనిపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, శాంతికోటేశ్ గౌడ్, మేక లలితాయాదవ్, శ్రీనివాస్రెడ్డి, చిత్రాసుబ్రహ్మణ్యం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేశ్ , నాయకులు పాల్గొన్నారు.