కంటోన్మెంట్, ఆగస్టు 21: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ ఎంసీలో విలీనం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 26వ తేదీన కంటోన్మెంట్ బోర్డును డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ బృందం సందర్శించనున్న నేపథ్యంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేయడంతో పాటు వాస్తవ పరిస్థితులను కమిటీ దృష్టికి తీసుకెళ్లేలా చొరవ తీసుకోవాలని కోరుతూ శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, టీ ఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డిలకు వినతిపత్రాన్ని అందజేశారు. దీని కి స్పందించిన మంత్రి మల్లారెడ్డి మా ట్లాడుతూ.. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పలు ప్రాంతాలను జీహెచ్ఎం సీలో విలీనం చేసే దిశగా కమిటీకి సూ చనలు చేస్తానన్నారు. వికాస్ మంచ్ సభ్యులు ఎబెల్, సంకి రవీందర్, ప్రభుగుప్తా, ముప్పిడి మధుకర్, రాములుయాదవ్, అరుణ్యాదవ్, బల్వంత్రెడ్డి పాల్గొన్నారు.