-బండ్లగూడలో ఎస్ఎన్డీపీ పనుల శంకుస్థాపన
-ఎల్బీనగర్ అండర్పాస్, బైరామల్గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం
ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేయనున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపడుతున్న ఎస్ఎన్డీపీ పనులను నాగోలు డివిజన్లోని బండ్లగూడలో ఉదయం 9 గంటలకు శంకు స్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ అనంతరం ఎల్బీనగర్ అండర్పాసును, బైరామల్గూడ ఫ్లె ఓవర్ను ప్రారంభించనున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి మంత్రి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇన్నర్ రింగ్రోడ్డులో ట్రాఫిక్ చిక్కులకు చెక్
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఇన్నర్ రింగ్రోడ్డులో ట్రాఫిక్ చిక్కులకు తాజా ప్రారంభోత్సవాలతో చెక్ పడనుంది. ఇన్నర్ రింగ్రోడ్డు నుండి ఎలాంటి చిక్కులు లేకుండా ప్రస్తుతం నిర్మించిన అండర్పాస్తో ఇరువైపులా సాఫీగా ప్రయాణం సాగనున్నది. బైరామల్గూడ ప్రాంతంలోనూ ప్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో రెండు వైపులా ప్రయాణం ఎంతో తేలిక కానున్నది.
వీటికి తోడుగా ఎల్బీనగర్ జాతీయ రహాదారిపై మరో ప్లై ఓవర్తో పాటుగా బైరామల్గూడ జంక్షన్లో పనులతో పాటుగా నాగోలు ప్లై ఓవర్ నిర్మాణం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.