హైదరాబాద్ : చారిత్రక గండిపేట జలాశయం తీరంలో పర్యాటకులను కనువిందు చేసేలా కొత్తందాలను జోడిస్తూ సర్వాంగ సుందరంగా 5.50ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త పార్కు నిర్మితమైంది. ఈ పార్కును రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్లు, ఎంట్రెన్స్ ప్లాజా, వాక్వేస్, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను రూ.35.60 కోట్ల వ్యయంతో చేపట్టారు.
This is how #Gandipet park developed by @HMDA_Gov looks like now .. the latest edition for family outing and being with nature
it will be inaugurated by minister @KTRTRS soon pic.twitter.com/lOWwLbYNtO
— Arvind Kumar (@arvindkumar_ias) September 23, 2022