హైదరాబాద్ : రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. కేపీహెచ్బీ కాలనీలోని ఫేజ్ -9లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును కేటీఆర్ ప్రారంభించారు. ఫేజ్ -7 లో నిర్మించిన ఆధునిక వైకుంఠధామాన్ని కూడా కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, స్టార్మ్ వాటర్ నాలా, ఐడీఎల్ చెరువు, హెచ్ఐజీ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో మంత్రి @KTRTRS పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కే.పి.హెచ్.బి కాలనీ, ఫేజ్ – 9 లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే @mkrkkpmla, ఎమ్మెల్సీ @naveenktrs, మేయర్ @GadwalvijayaTRS పాల్గొన్నారు. pic.twitter.com/65bYNKGYLE
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 2, 2022
కూకట్ పల్లి నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి. కాలనీ ఫేజ్ -7 లో నిర్మించిన ఆధునిక వైకుంఠధామాన్ని పురపాలక శాఖ మంత్రి @KTRTRS ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే @mkrkkpmla, ఎమ్మెల్సీ @naveenktrs, మరియు @GHMCOnline అధికారులు పాల్గొన్నారు. pic.twitter.com/83nzMos3TM
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 2, 2022