మన్సూరాబాద్, డిసెంబర్ 6: నాగోల్ డివిజన్లో రూ.55కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం మంగళవారం ఉదయం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాకతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. నాగోల్ చౌరస్తా నుంచి మొదలుకొని బండ్లగూడ మీదుగా ఫతుల్లాగూడ వరకు ఎక్కడా చూసిన గులాబీ మయంగా మారింది. వందలాది కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను అనుసరిస్తూ అభివృద్ధిపనుల శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ రాములు, శాసనమండలి సభ్యులు సురభి వాణీదేవి, బొగ్గారపు దయానంద్ గుప్త, నవీన్కుమార్, శంభీపూర్ రాజు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీఎస్ఐటీసీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, టీఎస్ రెడ్కో చైర్మన్ వై. సతీశ్రెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ, హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, వజీర్ ప్రకాశ్గౌడ్, జిట్టా రాజశేఖర్రెడ్డి, జీవీ సాగర్రెడ్డి, రమావత్ పద్మానాయక్, చెరుకు సంగీత, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్రెడ్డి, భవానీ ప్రవీణ్కుమార్, సామ తిరుమల్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస రావు, నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, టీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు కుంట్లూరు వెంకటేశ్గౌడ్, పోచబోయిన జగదీశ్యాదవ్, జక్కిడి రఘువీర్రెడ్డి, తూర్పాటి కృష్ణ, సుర్వి రాజుగౌడ్, రుద్ర యదగిరి, లింగల రాహుల్గౌడ్, చింతల రవికుమార్, కటికరెడ్డి అరవింద్ రెడి, రఘుమా రెడ్డి, చెన్నగోని శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.