బంజారాహిల్స్, సెప్టెంబర్ 26 : బంజారాహిల్స్ రోడ్ నెం.1 నాగార్జున సర్కిల్లో ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన బంజారాహిల్స్ వైకుంఠ మహాప్రస్థానాన్ని మంగళవారం పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫీనిక్స్ ఫౌండేషన్ చైర్మన్ చుక్కపల్లి సురేశ్తో కలిసి మంత్రి కేటీఆర్ అక్కడ సదుపాయాలను పరిశీలించారు. దహనవాటికలు, వెయిటింగ్ రూమ్స్, అస్థికలు భద్రపరిచే గది, వీఐపీ లాంజ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు రూ.1.40 కోట్ల వ్యయంతో చేపట్టిన పంజాగుట్ట ప్రధాన శ్మశానవాటిక సుందరీకరణ పనులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దారిపొడవునా మంచి డిజైన్తో పచ్చదనాన్ని ల్యాండ్స్కేపింగ్ను తీర్చిదిద్దడాన్ని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, డీఎంసీ ప్రశాంతి, జోనల్ ఎస్ఈ రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.