Minister KTR | నగరంలోని జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.100కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హెచ్ఎండీఏ నుంచి కేటాయించిన ఈ నిధులతో మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు పలువురు ఆయా కాలనీల్లోని ప్రజలు మరమ్మతుల కోసం నిధులు వెచ్చించుకోలేరని, ప్రభుత్వమే వారికి అవసరమైన విధులను అందిస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో పేదల లబ్ధి చేకూరుతుందంటే నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడబోదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జంగంమెట్, బండ్లగూడతో పాటు జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే కాలనీల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ సిబ్బంది పూర్తి చేస్తారన్నారు.