ముషీరాబాద్/అంబర్పేట, నవంబర్ 26 : శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యదర్శులు వి.సుధాకర్గుప్త, ముచ్చకుర్తి ప్రభాకర్, వివేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించి, కార్నర్ మీటింగ్లలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
సోమవారం రాంనగర్లో రోడ్ షో నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. అనంతరం చేపల మార్కెట్ గుండా భోలక్పూర్కు చేరుకొని సుప్రీం హోటల్ జంక్షన్లో రోడ్షో అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ రోడ్షోకు పెద్దఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అంబర్పేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు అంబర్పేట డివిజన్ అలీకేఫ్ చౌరస్తా, నల్లకుంట ఫీవర్ దవాఖాన చౌరస్తాలో కేటీఆర్ రోడ్షో ఉంటుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు.