ప్రజలకు పాలన చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన వార్డు కార్యాలయ పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై సమీక్ష జరుగుతున్న సమయంలోనే ఆయన వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసిన పౌరులతో ముచ్చటించారు.
విద్యుత్ సమస్యపై ఫిర్యాదు చేసిన గాజుల రామారానికి చెందిన రాముకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. మంత్రి స్వయంగా ఫోన్ చేసి సమస్య పరిష్కారంపై ఆరా తీయడంపై రాము సంతోషం వ్యక్తం చేశారు.