హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. హుస్సేన్సాగర్ నెక్లెస్రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లాయి. భారత్లో నిర్వహిస్తున్న తొలి స్ట్రీట్ సర్క్యూట్ కాగా.. ఇందులో హైదరాబాద్లో జరుగుతుండడం విశేషం. రేస్లో మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొనగా.. హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం జెండా ఊపి లీగ్ను ప్రారంభించారు. అనంతరం లీగ్ను వీక్షించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లను చూసి కేరింతలు కొట్టారు.