హైదరాబాద్ : ఈ నెల 24న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ స్పష్టం చేశారు. కేటీఆర్ పేరిట 116 ఆలయాల్లో అర్చనలు చేయిస్తామని చెప్పారు. గత ఎనిమిదేండ్లుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కేక్లో రూపొందిస్తామన్నారు. కేక్ కటింగ్ ప్రాంతంలో కాళేశ్వరం, దుర్గం చెరువు త్రీడీ గ్రాఫిక్స్ వచ్చేలా ప్లాన్ చేశామని తెలిపారు.
ఇప్పటి వరకు మంత్రి కేటీఆర్ చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలను డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ది లీడర్ ఫ్రం లోకల్ టు గ్లోబల్ అనే పేరుతో కేటీఆర్ అంచెలంచెలుగా ఎదిగిన విధానం డాక్యుమెంటరీలో పొందుపరిచినట్లు తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలో హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కూడా ఉంటుందని సాయికిరణ్ యాదవ్ స్పష్టం చేశారు.