ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
మాదాపూర్, ఏప్రిల్ 5 : కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, చిన్న కుటుంబంలాంటి మీడియాను హైబిజ్ టీవీ ఒకే వేదికపైకి తీసుకు రావడం అభినందనీయమన్నారు. మీడియా ట్రెండ్స్ మారుతున్నాయని.. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా చాలా బలంగా మారుతున్నాయన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎజెండా సెట్టింగ్లో సోషల్ మీడియా ప్రధాన స్ట్రీమ్కు పోటీగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నికిలేష్ లిమిటెడ్ ముంబై గ్లోబల్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కేవి శ్రీధర్, 360 లైఫ్ డైరెక్టర్ నమిత, క్రెడాయ్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్రెడ్డి, లైఫ్ స్పామ్ సీఎండి నరేంద్ర రామ్, ఈనాడు డైరెక్టర్ వెంకట్, డ్రీమ్ స్కేప్ వ్యవస్థాపకులు, చైర్మన్ నాగరాజు నడికుడి, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు చక్రధరరావు, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, హైబిజ్ టీవి తెలుగు మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్గోపాల్, హైబిజ్ టీవి సీఈఓ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణకు..
నమస్తే తెలంగాణ నుంచి బెస్ట్ బిజినెస్ రిపోర్టర్గా కృష్ణారావు, బెస్ట్ స్పోర్ట్స్ రిపోర్టర్గా చెగ్గోజు రాజశేఖర్, బెస్ట్ స్టోరీ బై ఉమెన్ జర్నలిస్ట్గా నిఖిత నెల్లుట్ల, ప్రింట్ మీడియా కేటగిరీలో మహేందర్రెడ్డి, బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో బాల్రాజ్ బుధారపు, బెస్ట్ ఈవెంట్ కేటగిరీలో రాజిరెడ్డి మొగుల్ల, న్యూ సబ్స్క్రిప్షన్ కింద రాజన్న పిన్నెం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.