హైదరాబాద్ : హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సందీప్, పూజితను ఆశీర్వదించారు.
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్… కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితను వివాహామాడారు. నగరంలోని పార్క్ హయత్ స్టార్ హోటల్లో గతేడాది డిసెంబర్ నెలలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.