హైదరాబాద్: నగరంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఒవైసీ-మిధాని జంక్షన్లో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పొడవు 1.365 కిలోమీటర్లు. దీన్ని మంగళవారం నాడు ప్రారంభించనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ను హైదరాబాద్ ప్రజలకు అంకితం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ.80 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు.