మణికొండ, జనవరి 21: మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా.. సంస్కృతం తరువాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
ఆదివారం నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించిన తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన జీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ప్రముఖ నాట్యకారిణి కళాకృష్ణ, సంపత్కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు వాడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యమన్నారు. సమ్మేళనంలో గంగిరెద్దుల విన్యాసాలు, పేరిణి ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్చార్జి మురళీధర్రావు, తదితరులు పాల్గొన్నారు.