శ్రీశైలం, ఆగస్టు 8: శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగానే.. ఆలయ అధికారులు, అర్చక, వేదపండితులు కలిసి తిలకధారణ చేసి స్వాగతం పలికారు. శ్రావణ సోమవారం ఏకాదశి కావడంతో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేశారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు.