హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మాజీ సభ్యుడు పాతూరి సుధాకర్ రెడ్డి సతీమణి యాదమ్మ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. యాదమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సుధాకర్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
అలాగే తన వద్ద ఓఎస్డీగా పని చేస్తున్న మల్లెల శ్రీనివాసరావు తల్లి మల్లెల దయామతి మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.