సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : నిమ్స్లో చికిత్స పొందుతున్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు వైద్యులను కోరారు.
నిమ్స్ను సందర్శించిన ఆమె ప్రీతికి అందుతున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ధరావత్ శారద, నరేందర్ నాయక్తో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.