మేడ్చల్ కలెక్టరేట్/ఘట్కేసర్ రూరల్, మార్చి 5: ఐక్య మత్యంతో ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ 15వ వార్డు ఈస్ట్ గాంధీనగర్ కాలనీలో కాలనీ వాసులు, దాతల సహాయంతో రూ.13 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాలనీ సమూహిక అవసరాలు తీర్చుకునేందుకు ఒక్కటై, నిధులు సమకుర్చుకోవడం కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. ఇది పలు కాలనీలకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
భవిష్యత్లో ఇదే ఐక్య మత్యాన్ని కొనసాగిస్తు, అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలని తొటి వారి కష్ట నష్టాలలో అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీ మాదిరెడ్డి స్వప్న, కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కో-అప్షన్ సభ్యులు షపీ, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీధర్, కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరుల పాల్గొన్నారు.
దైవచింతన కలిగిన ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి కాచవానిసింగారంలో జరుగుతున్న శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయ జాతర ఉత్సవాల్లో ఆదివారం మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ గీత, పంచాయతీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.