హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో రైళ్లను నడుపుతున్నామని తెలిపారు.
చివరి రైలు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు ప్రారంభమైన చివరి స్టేషన్కు 2 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. మార్గ మధ్యలోని మెట్రో స్టేషన్లలో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే వారు మద్యం సేవించకూడదన్నారు. ఇతరులతో దుర్బాషలాడొద్దని సూచించారు. ప్రయాణికులందరూ మెట్రో రైలు సిబ్బంది, పోలీసులకు సహకరించాలన్నారు. అన్ని స్టేషన్లు, రైళ్లలో నిఘా ఉంచుతామని ఎండీ స్పష్టం చేశారు.