సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నగరంలో(Hyderabad) మెట్రో రైళ్ల రాకపోకలు(Metro services) ఉదయం 5.30 గంటల నుంచే మొదలవుతాయని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దానికి తోడు ప్రస్తుతం ఉన్న సమయాలను పొడిగించాలని నగర వాసులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైళ్ల వేళలను(Metro times) పొడిగించాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుండడంతో ప్రయోగాత్మకంగా శుక్రవారం ఉదయం 5.30 నుంచే మెట్రో రైలును నడిపామని, ఆ సమయంలో ప్రయాణి కుల ఆదరణ ఉండడంతో ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచే అందించాలని నిర్ణయిం చామని తెలిపారు. మెట్రో రైళ్లు నగర వాసులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండేలా టైమ్ టేబు ల్స్ను మారుస్తున్నామని, ప్రయాణికుల నుంచి ఇచ్చే డిమాండుకు అనుగుణంగా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. మూడు కారిడార్లలోని టర్మినల్ మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు ఉదయం 5.30 నుంచే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.