రవీంద్రభారతి,జూన్ 25 : ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కుట్టుపనిని మేరు కులస్తులకు కేటాయించాలని మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాడపల్లి మాధవ్, కార్యదర్శులు సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కలెక్టర్లకు విన్నవించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశంతో మేరు కులస్తులకు 30 శాతం యూనిఫాం బట్టలను ఇవ్వాలని శనివారం జీవో విడుదల చేశారని వారు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ మేరు కులస్తుల సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.