ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
లక్ష్మీగూడలో మెగా వైద్య మేళా ప్రారంభం
మైలార్దేవ్పల్లి,ఏప్రిల్ 21: అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడలోని శ్రీలక్ష్మి పొదుపు సంఘంలో గురువారం రాజేంద్రనగర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మెగా ఆరోగ్య మేళా ప్రారంభించారు. ఇందులో ఆయా స్పెషలిస్టుల ద్వారా పలు రకాల హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన విధానంలో తరచూ మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు అధికంగా వస్తున్నాయని వాటి భారీ నుంచి తప్పించుకోవడానికి వైద్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం వైద్య, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. వైద్యశిబిరాలు పేద లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక వైద్యులతో పేదలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సృజన తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ బాల్రామ్ ,డీపీఎంవో రవీందర్రెడ్డి, డాక్టర్ స్వాతి, డాక్టర్ దివ్య, డాక్టర్ వందన, డాక్టర్ నిరోష, ఎస్ఈవో శ్రీనివాస్,సీహెచ్వో ఎండీ సిరాజ్ఉద్దీన్, హెచ్ఈవో చెన్నకేశవులు, సూపర్ వైజర్ శివకుమార్ నాయకులు పాల్గొన్నారు.