మన్సూరాబాద్ : వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు సేవలందించాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంహీత ఈఎన్టీ, చిల్డ్రన్స్ కేర్ సెంటర్ను గురువారం ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించాలని, ఆ దిశగా దవాఖాన యాజమాన్యం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన నిర్వహకులు డాక్టర్ సీహెచ్. భానుప్రతాప్ చందర్, డాక్టర్ బి. సోనిక, వనస్థలిపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చింతల రవి తదితరులు పాల్గొన్నారు.