బన్సీలాల్పేట్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో విధ్వంసానికి పాల్పడిన నిందితులకు గాంధీ దవాఖానలో డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు.. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దశల వారీగా వారికి వైద్యపరీక్షల కోసం గాంధీకి తీసుకువస్తున్నారు.
ఇప్పటికే 17 మందికి ప్రక్రియ పూర్తవ్వడంతో వారిని రైల్వేకోర్టులో హాజరుపరిచారు.