గోల్నాక, నవంబర్ 26: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పురాతన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. శనివారం అంబర్పేట డివిజన్లోని నరేంద్రనగర్లో రూ.7లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్ల పరిధిలో ఉన్న అన్ని బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే ఉన్న డ్రైనేజీ పైప్లైన్లను ఆధునీకరించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొద ట డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. జలమండలి ఎండీని కలిసి ప్రత్యేకంగా నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు.
చాలా బస్తీలలో తాగునీరు, డ్రైనేజీ పైపులను మార్చినట్లు చెప్పారు. అలాగే ఎక్కడైతే కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నదో అక్కడ వెంటనే పైప్లైన్ వ్యవస్థను మారుస్తున్నామన్నారు. జనాభా పెరగడంతో వారి అవసరాలకు అనుగుణంగా బస్తీలలో పైప్లైన్ వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. పాదయాత్రలు, పర్యటనలు చేస్తున్న సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నానని వివరించారు. ఎక్కడ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, సీనియ ర్ నాయకులు రామారావుయాదవ్, కె.లింగారావు, లత, లవంగం అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.