సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణి అర్జీల సత్వర పరిషారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, కమిషనర్కు విన్నవిస్తూ అర్జీలను అందజేశారు. వ్యక్తిగత సమస్యలపై ఎకువ విన్నపాలు వస్తున్నాయని, సమస్య పరిషారం అయినట్లు అర్జీదారునికి లేఖ పూర్వకంగా తెలియజేస్తున్నట్లు కమిషనర్ పేరొన్నారు. ఈ సందర్భంగా హెడ్ ఆఫీస్లో 70 విన్నపాలు, జోనల్, సరిళ్లలో కలిసి మొత్తం 87, మొత్తం 157 దరఖాస్తులు అందాయని తెలిపారు.
ప్రజావాణికి ముందుగా కమిషనర్ రొనాల్డ్ రాస్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా నగర ప్రజలు తెలియజేసిన సమస్యల పరిషారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంత రెడ్డి, యాదగిరి రావు, జయరాజ్ కెన్నెడీ, గీతా రాధిక, ఎస్టేట్ డైరెక్టర్ మహమ్మద్ బాషా, సీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజ, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.