సామాజిక నేపథ్యం : సికింద్రాబాద్, బోయిన్పల్లికి చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని.. సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్యతోనే సాధ్యమని గుర్తించి విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి రాజకీయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్కు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం కంటోన్మెంట్ నియోజకవర్గం, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు.
విద్యార్హతలు : బీకాం
వృత్తి : విద్యాసంస్థలు సేవా కార్యక్రమాలు : రాష్ట్రంలో చేతి వృత్తుల జీవన విధానం స్థితిగతులపై ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’ అనే ప్రభుత్వ సంస్థ సహకారంతో సొంత ఖర్చులతో అధ్యయనం చేయించి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.
కలిసొచ్చే అంశాలు : ఇప్పటికే ప్రజలతో మేమకమై ఉన్నారు. తన స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ, అక్టోబర్ 18 : నియోజకవర్గ ప్రజలు తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి దీవించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లో ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని తెలిపారు. బుధవారం ఆయన నివాసంలో నియోజకవర్గంలోని సులేమాన్ నగర్, ఎం,ఎం ఫహాడీ, శాస్త్రిపురం డివిజన్ల నుంచి దాదాపు 100 మంది ముస్లిం నాయకులు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో మరోసారి గెలిచి, తనపై నమ్మకంతో సీటు కేటాయించిన సీఎం కేసీఆర్గారికి కానుకగా ఇస్తానన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమపథకాలు ఎమ్మెల్యే గారిని మరోసారి గెలిపిస్థాయని స్థానిక నాయకులు గౌస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు మస్లింలకు చేరుతున్నాయన్నారు. సులేమాన్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఎండీ గౌస్ , అధ్యక్షుడు షేక్ నయిమొద్దీన్, ఎండీ ఇస్మాయిల్, అక్బర్, జీషాన్, తయార్, రూఫ్, శాస్త్రీపురం డివిజన్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.