మల్కాజిగిరి, అక్టోబర్ 29: మల్కాజిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం వెంకటాపురం, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. అలాగే పలు సమావేశాలలో పాల్గొని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. మల్కాజిగిరి పరిధిలోని సర్వే నంబర్ 278లో నివసిస్తున్న కుటుంబాల భూమి సమస్యలను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పరిష్కరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
భూముల రెగ్యులరైజేషన్ కోసం జీఓ 59తో గజానికి రూ.27వేలు చెల్లించారని, కానీ ఇండ్ల యజమానులకు తాఖీదులు అందాయన్నారు. ఆందోళనకు గురైన ఇండ్ల యజమానులు తమ సమస్యను పరిష్కరించాలని తనను కోరారని తెలిపారు. తాను స్వయంగా సీఎం కేసీఆర్ వద్దకు సమస్యను తీసుకెళ్లానని చెప్పారు. వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి మరో జీఓను విడుదల చేశారని… దాని ప్రకారం గజానికి రూ.250 కడితే సరిపోతుందన్నారు. ఇక్కడ నివసిస్తున్న దాదాపు 80వేల మంది సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు సబితాకిశోర్, సునీతారాము యాదవ్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, మీనాఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, ఆకుల నర్సింగరావు, అనిల్కిశోర్ తదితరులు పాల్గొన్నారు.