మల్కాజిగిరి, నవంబర్ 3: మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ శ్రీకాలనీలో మైనారిటీ నాయకుల సమావేశం, అల్వాల్, ఈస్ట్ ఆనంద్ బాగ్, గౌతంనగర్ డివిజన్లలో మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇంటింటికి ప్రచారం నిర్వహించి సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూర్తి రక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు చదువుల కోసం రెసిడెన్సియల్ స్కూల్స్లో ఉచితంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. ఆడ బిడ్డ పెండ్లికి షాదీ ముబారక్ – కల్యాణ లక్ష్మి పథకంలో రూ.1,00,116 ఇస్తున్నామని, ఎన్నికల తర్వాత రూ.2,00,116 అందజేస్తామని అన్నారు.
మౌలాలిలో కమ్యూనిటీ హాల్, శ్మాశాన వాటికలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను విడతల వారీగా అమలుపరుస్తామని అన్నారు. విడతల వారీగా పెన్షన్లు పెంచుతామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకంలో మహిళలకు నెలనెల రూ.3 వేలు అందజేస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీత రాము యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, సబితా కిశోర్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్దం పరశురాంరెడ్డి, జేఏసీ వెంకన్న, మురుగేష్, భాగ్యనంద రావు, ఉస్మాన్, శ్రీనివాస్, ఇబ్రహీం, శైలేందర్, గౌలికర్ దీనేష్, జగదీష్, సంతోష్ గుప్త, ఆది నారాయణ, సాదిక్, నర్సింగరావు, తోట నాగేష్, నవాబ్, శ్రీనివాస్ రెడ్డి, సాబిర్, ప్రవీణ్ గౌడ్, గణేష్ పాల్గొన్నారు.