Covid Vaccine | ఖైరతాబాద్, ఏప్రిల్ 1 : కొవిడ్తో పాటు ఇతర టీకాలు బలవంతంగా ప్రజలకు వేయడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆవేకెన్ మూవ్మెంట్ ఇండియా ఆరోపిస్తున్నది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్ సక్సెనా, ప్రొఫెసర్ భాస్కర్ రామన్, సరస్వతి కవుల, డాక్టర్ సుధా చెప్యాల మాట్లాడుతూ ఒక టీకా వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసుకొని సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే వేయాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్లాది మందికి వేశారని అన్నారు.
ఫలితంగా అనేక దుష్ప్రభావాలు వస్తున్నాయని, 99 మిలియన్ల మందికి ఈ ప్రభావం చూపినట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. కొవిడ్ టీకాల దుష్ప్రభావాల బాధితుల వివరాలను సైతం సేకరించడం లేదని, దీని కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రభుత్వం రూపొందించాలన్నారు. అలాగే చిన్నారులకు సైతం ఇష్టారీతిలో టీకాలు వేయిస్తున్నారని, వాటికి ప్రామాణికత ఉందా లేదా అనే తెలుసుకోవాలని, ఇలాంటి వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం, ఇతర జన్యు సంబంధిత వ్యాధులు కలుగుతున్నాయన్నారు. కొన్ని సంస్థలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే మార్కెట్లోకి టీకాలను తీసుకువస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్నారు.