హైదరాబాద్ : నగరంలోని యూసుఫ్గూడలో స్థిరాస్తి వ్యాపారి పుట్ట రాము(Putta Ramu) హత్య కేసులో(Murder case) పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నలుగురు రౌడీ షీటర్లు సహా ఏడుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ జిలానీ, ఫరూక్, ఫిరోజ్, యూనిస్, గణపతి, రాజు, కమలాకర్ ఉన్నారు. కాగా, హైదరాబాద్ యూసుఫ్గూడలోని లక్ష్మీనరసింహనగర్లో దారుణం జరిగింది.
పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. రాముపై ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రాము రియల్ ఎస్టేట్ వ్యాపారి. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా ఉంటారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని కూడా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? అనే ఉద్దేశంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.