ఎర్రగడ్డ, సెప్టెంబర్ 25 : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. గోపీనాథ్ సమక్షంలో బోరబండ డివిజన్కు చెందిన ఎంఐఎం నాయకుడు షేక్ మునీర్ సోమవారం తన అనుచరులు 200 మందితో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. విద్యారంగంలో చాలా వెనుకబడి ఉన్న మైనార్టీలకు ప్రత్యేకించి గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత ఒక్క కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు. గల్లీలో గప్పాలు కొట్టి.. ఢిల్లీకి పరుగులు పెట్టే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తెలంగాణ రాష్ర్టానికి ఒరగబెట్టేది ఏమీ లేదన్నారు. ఎంఐఎం నాయకుడు షేక్ మునీర్ మాట్లాడుతూ.. చక్కటి పరిపాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ విధానాలు, ఎమ్మెల్యే గోపీనాథ్ ఆధ్వర్యంలో బోరబండలో జరిగిన అభివృద్ధిని చూసి తామంతా బీఆర్ఎస్లో చేరామన్నారు. పార్టీలో చేరిన వాళ్లలో ఎండీ షఫీ, ఎండీ అన్వర్, మీర్ హుస్సేన్ అలీ, ఎండీ కలీం, ఖైసర్, షేక్ జునేద్, షేక్ ఆజం, సయ్యద్ హఫీజ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కో-ఆర్డినేటర్ విజయసింహ, షరీఫ్, కాసుల మహేశ్ గౌడ్, ముఖేశ్, బాబూరావు, జీవన్, ఆనంద్కుమార్, యూసుఫ్, ధర్మ, మధు, జైభీమ్ యాదగిరి, సుధాకర్, షరీఫ్, జీవన్నాయక్, బాబా నాయక్ తదితరులు పాల్గొన్నారు.